చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని.. కిడ్నాప్ ఘటనలో అనుమానాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు జిల్లాలో తిరుగుతున్నాయనే అపోహలను నమ్మవద్దని సూచించారు. కమిషనరేట్ పరిధిలో చిన్నారుల కిడ్నాప్ కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ పేర్కొన్నారు. అనుమానితుల వీడియోను కిడ్నాపర్లుగా చిత్రీకరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు తెలిసిందన్నారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Discussion about this post