అనకాపల్లి జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కామన్ ఇంక్యుబేషన్ సెంటరును ఎంపీ సత్యవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ సహకారంతో ఇంక్యుబేషన్ సెంటర్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రైతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికే ఈ కార్యక్రమం అన్నారు. బెల్లం నుంచి వచ్చే ఉత్పత్తులను ఎగుమతి చేయటం వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.
Discussion about this post