సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ-జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ రెండ్రోజులపాటు ఉభయగోదావరి జిల్లాల్లో ఉమ్మడిగా రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు రోడ్షో నిర్వహిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్డు మార్గాన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మీదుగా నిడదవోలు చేరుకుంటారు. నిడదవోలు గణేష్చౌక్ సెంటర్లో రాత్రి రోడ్ షో నిర్వహిస్తా రు. చంద్రబాబు, పవన్ కలిసి తొలిసారి ఉమ్మడిగా జిల్లాలో పర్యటిస్తున్నారు. దాంతో వీరిద్దరి పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.ఈ సందర్భంగానే అసంతృప్త నేతలతో చంద్రబాబు మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారు.
Discussion about this post