బీజేపి అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్కృష్ణ ఆడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే రాష్ట్రపతి వెళ్లి పురస్కారాన్ని అందించారు.
1927 నవంబరు 8న అవిభక్త భారత్లోని కరాచీలో ఆడ్వాణీ జన్మించారు. అక్కడే సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. పాక్లోని హైదరాబాద్లో ఉన్న డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డారు. తొలుత రాజస్థాన్లో సంఘ్ ప్రచారక్గా పనిచేసి, 1957లో దిల్లీకి వెళ్లి జన్సంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో ఆ కౌన్సిల్ ఛైర్మన్గా గెలిచారు. 1970-72లో భారతీయ జనసంఘ్ దిల్లీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆర్గనైజర్ పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. అయోధ్య రథయాత్రతో పాటు పలు యాత్రలు చేసి తనదైన ముద్ర వేశారు.
ఆడ్వాణీ 1970లో దిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1976లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977-79 మధ్య కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1980 ఏప్రిల్ 6న వాజ్పేయీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపి అతిపెద్ద పార్టీగా అవతరించగా…. వాజ్పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి ఆడ్వాణీ గెలిచారు. 2004 ఎన్నికల్లో బీజేపి ఓటమి పాలవ్వడంతో ఆడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. లోక్సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో బీజేపి ప్రధాని అభ్యర్థిగా పోటీచేశారు. కానీ, ఆ ఎన్నికల్లో కాషాయ దళం ఓడిపోయింది. 2014లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన ఆడ్వాణీ.. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
మాజీ ఉపప్రధాని లాల్కృష్ణ అడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న
స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేసిన రాష్ట్రపతి
1927 నవంబరు 8న అవిభక్త భారత్లోని కరాచీలో ఆడ్వాణీ జననం
1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆరెస్సెస్లోకి ఆడ్వాణీ
1947లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు
పాక్లోని హైదరాబాద్ డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్య
దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిర నివాసం
1957లో జన్సంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
1967లో జన్సంఘ్ ఛైర్మన్ గెలుపు
1970-72లో భారతీయ జనసంఘ్ దిల్లీ విభాగం అధ్యక్షుడిగా నియామకం
1970లో దిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నిక
1976లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు ఎన్నిక
1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి
1980 ఏప్రిల్ 6న వాజ్పేయీతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపన
1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభ ఎన్నిక
1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఎదిగిన బీజేపి
1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపి ప్రభుత్వ ఏర్పాటు
1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి గెలిచిన అడ్వాణీ
2014లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన ఆడ్వాణీ
2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆడ్వాణీ
Discussion about this post