మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ పల్లి గ్రామంలో మైలారం మల్లన్న జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ జాతర లో భాగంగా మల్లన్న స్వామి కళ్యాణం జరిగింది. అనంతరం పసుపు బండారు, పూనకాలు, ఒగ్గు కథలతో గ్రామంలో మల్లన్న స్వామి ఊరేగించారు. గొలుసు తెంపుడు కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జాతర మహోత్సవాలకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు వచ్చిన భక్తులకు దేవస్థానం అన్నదానం చేసింది.
Discussion about this post