అనకాపల్లి జిల్లా.. విద్యా శాఖ సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ , పార్ట్ టైం ఉద్యోగుల సమ్మె తీవ్ర స్థాయికి చేరుకుంది. సమ్మె మొదలైన మూడవరోజు శిబిరంలో కుప్పకూలిన జడ్డు వాసుదేవరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.ఇందుకు నిరసనగా అనకాపల్లి డిఇఓ ఆఫీస్ ముందు వాసుదేవరావు మృత దేహాన్ని ఉంచి ఉద్యోగులు శ్రద్ధాంజలి ఘటించారు.వాసుదేవరావు మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యని ఉద్యోగులు అభివర్ణించారు. ఉద్యోగుల డిమాండ్లతో పాటు వాసుదేవరావు కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. murthy 19.00 pm
Discussion about this post