భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రాజీవ్ నగర్ కాలనీలో భూకబ్జాకు విలేకరి సహాయసహకారాలు అందిస్తున్నాడు. 1961 నుంచి తమ తాతలు సాగుచేసుకున్న 10 ఎకరాల భూమి కబ్జాకు ఆంధ్రప్రభ విలేకరి వెంకటేశ్వర్లు సహకరిస్తున్నారని బాధిత కుటుంబంలోని మంద శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను అడ్డుపడకుండా ఉండాలంటే ఒక ఎకరం భూమి ఇవ్వాలని డిమాండు చేస్తున్నారన్నారు. అన్నదమ్ములం 10 మందిమి దీనిపై ఆధారపడి బ్రతుకుతున్నామని, దయతో న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.
Discussion about this post