హైదరాబాద్‌లో ఘోరం.. అడ్వకేట్‌ను కారుతో తొక్కించిన కిరాతకులు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉదయాన్నే తీవ్ర కలకలం రేగింది. మాసాబ్‌ట్యాంక్‌లో ఓ ప్రముఖ అడ్వకేట్‌ ఖాజా మొయిజుద్దీన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు.

మే 23న ఉదయం మాసాబ్‌ట్యాంక్‌లోని తన నివాసం వద్ద అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ ఉండగా… ఒక్కసారిగా ఓ కారు ఆయనను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వేగానికి ఆయన రోడ్డుపై పడిపోగా వాహనం అక్కడి నుంచి క్షణాల్లో పరారైంది. ఈ ప్రమాదంలో ఖాజా మొయిజుద్దీన్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం ప్రమాదమా? లేక కావాలనే ఆయనను అంతమొందించడానికి పక్కా స్కెచ్‌తో చేసిన దాడా?

అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ విజువల్స్ చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడిలాగే కనిపిస్తోందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఆ వాహనం ఎవరిది? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top