ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ కనిపించకుండా పోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యాడారం లయ అలియాస్ శ్యామల తన కూతుళ్లు బిందు, దివిజ, కొడుకు శివతో కలిసి షాపింగ్ కోసమని కామారెడ్డి వచ్చారు. అక్కడి నుంచి కామారెడ్డిలోనే ఉండే తన తమ్ముడి ఇంటికి వెళ్లింది.

సాయంత్రం సొంతూరికి వెళ్తానని బయలుదేరిన శ్యామల, ముగ్గురు పిల్లలు రాత్రి అయినా ఇంటికి చేరలేదు. దీంతో శ్యామల భర్త భానుప్రకాశ్ కామారెడ్డి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఏరియాల్లో వెదికినా ఆచూకీ దొరకలేదు. కుటుంబ కలహాల కారణంగానే నలుగురు కనిపించకుండా పోయారని అనుమానిస్తున్నారు.
కామారెడ్డిలో తల్లి, ముగ్గురు పిల్లలు మిస్సింగ్పై వీడని మిస్టరీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు అదృశ్యం అదృశ్యమైన తల్లి లయ, పిల్లలు బిందు, శివ, దివిజ పిల్లలతో కలిసి షాపింగ్ కోసమని వచ్చిన లయ అలియాస్ శ్యామల ఆ తర్వాత కామారెడ్డిలోనే ఉండే తన తమ్ముడి ఇంటికి వెళ్లినట్టు గుర్తింపు సాయంత్రం సొంతూరికి వెళ్తానని బయలుదేరిన లయ, పిల్లలు మిస్సింగ్ కామారెడ్డి టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేసిన శ్యామల భర్త భానుప్రకాశ్ ఆర్థిక కారణాలు, కుటుంబ సమస్యల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Follow for more updates
