ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. అదే సమయంలో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్న రోస్ అవెన్యూ కోర్టులో రెండవ విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుపరచనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఈ స్కాంలో రెండో నిందితుడు ఆమ్ ఆద్మీ పార్టీలో నంబర్ టూగా ఉన్న మనీష్ సిసోడియా బెయిల్ విచారణ కూడా ఇవాళ జరగనుంది. మరోవైపు కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్పై బీజేపీ పట్టుదలగా ఉంది. కేజ్రీవాల్ మొండి వైఖరి వల్లే ఢిల్లీ కష్టాల్లో కూరుకుపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. జైల్లో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేస్తోంది. కేజ్రీవాల్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో యన్ డి ఏ భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు...
Discussion about this post