ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024 పురుషుల T20 ప్రపంచ కప్ జూన్ 1న ప్రారంభం కానుంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్లు, తీవ్రమైన పోటీలకు అమెరికా, కరేబియన్ దేశాలు వేదిక కాబోతున్నాయి. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచుకు న్యూయార్క్లోని ఐసెన్హోవర్ పార్క్ సిద్దమయ్యింది. T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ షెడ్యూల్, జట్టు లైనప్లను, కీలక మ్యాచ్లను ఒకసారి గమనిద్దాం…
T20 ప్రపంచ కప్ 2024 లో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటుండగా… వాటిని నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. నాలుగు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్ ఎయిట్ దశకు చేరుకుంటాయి. పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్లతో కలిసి భారత్ గ్రూప్-ఎలో ఉండగా…. అమెరికా, వెస్టిండీస్లలోని ఆరు వేదికలలో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. భారత్ తన మొదటి మ్యాచును జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుంది. ఆ తరవాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ తో హై-వోల్టేజ్ మ్యాచును ఆడనుంది.
చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ తో జూన్ 9న జరిగే మ్యాచుకు న్యూయార్క్ నగరం ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మరే ఇతర మ్యాచుకు లేని విధంగా 200 శాతం ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ మ్యాచుకు అందుబాటులో ఉన్న టికెట్ల కంటే 200 శాతం అధికంగా డిమాండ్ ఉందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. దీంతో చాలా మందికి నిరాశ తప్పలేదు. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 34,000 మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంది. దీంతో భారత్ -పాకిస్తాన్ మ్యాచుకు టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. అయితే దీనికి 200 రెట్లు అంటే ఏకంగా 68 లక్షల మంది నుంచి డిమాండ్ ఉందని ఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. తొలిసారి అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ జరగనుండటం, అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో ఈ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
Discussion about this post