జూన్ 29, శనివారం బ్రిడ్జ్టౌన్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరగనున్న T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ ఆడేందుకు టీమ్ ఇండియా బార్బడోస్ చేరుకుంది. జూన్ 27, గురువారం నాడు గయానాలో ఇంగ్లాండ్తో జరిగిన సెమీ-ఫైనల్ ముగిసిన వెంటనే రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు బార్బడోస్కు బయలుదేరింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా సౌత్ ఆఫ్రికా తో తలపడనుంది .ఎలా చూసిన టీం ఇండియా కె విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి .
2007 లో టీం ఇండియా మొదటిసారి కప్పు నెగ్గింది .అప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ లు అన్ని సౌత్ ఆఫ్రికా లో జరిగాయి .ఆ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా తన మొదటి మ్యాచ్ లో నెగ్గింది .వెస్ట్ ఇండీస్ పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది .ఈసారి కొన్ని వరల్డ్ కప్ మ్యాచ్ లు వెస్ట్ ఇండీస్ లో జరిగాయి .వెస్ట్ ఇండీస్ కూడా తన మొదటి మ్యాచ్ లో నెగ్గింది .అప్పుడు టీం ఇండియా కోచ్ లాల్ చాంద్ రాజ్ పుట్ ఒక మంచి బ్యాటర్ ..ఇప్పటి టీం ఇండియా కోచ్ ద్రావిడ్ కూడా మంచి బ్యాటర్ ..అప్పుడు జరిగిన మ్యాచ్ లలో ఓపెనర్ గా వీరేందర్ సెహ్వాగ్ ఒక్క మ్యాచ్ లో తప్పితే అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు .ఇప్పుడు కూడా ఒక్క మ్యాచ్ లో తప్పితే ఓపెనర్ గా విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ లో విఫలం అవుతున్నాడు . ఇండియా క్రితం గెలిచిన T20 వరల్డ్ కప్ లో ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టి యువరాజ్ సింగ్ రికార్డు నెలకొల్పాడు .ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు .ఇంతకు ముందు T20 వరల్డ్ కప్ లలో ఇండియా సౌత్ ఆఫ్రికా ల మధ్య జరిగిన మ్యాచ్ లను ఇండియా నే నెగ్గింది .ఇక సౌత్ ఆఫ్రికా విషయానికొస్తే ఆ జట్టు ఏ ఐసీసీ ఈవెంట్స్ లోను ఫైనల్ మ్యాచ్ లు నెగ్గలేదు .దురదృష్టం వెంటాడే ఆ జట్టు కీలకమైన సెమి ఫైనల్ లోను ఫైనల్స్ లోను ఎదో ఒక రకంగా ఓటమి పాలవడం మనకు కలిసొచ్చే అంశం .ఈరకంగా చూస్తే ఏ రకంగా అయినా టీం ఇండియా కప్పు కొట్టడం ఖాయం .
Discussion about this post