బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖలో భారీ డేటా చోరీకి గురైంది. సైనికాధికారులు, త్రివిధ దళాల, ప్రముఖుల వ్యక్తిగత, బ్యాంకు లావాదేవీలతో సహా సర్వం సైబర్ ఎటాక్ కు గురైందని తెలుస్తోంది. ఇది చైనా పనేనని ఆదేశం భావిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
చైనా తమ కంప్యూటర్లపై దాడి చేశాయని, బ్రిటన్ దర్వాప్తు సంస్థలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లోని ప్రధాన కంప్యూటర్ నెట్ వర్క్ ను తొలగించి నిఘా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. త్వరలో దీనిపై సమీక్ష నిర్వహిస్తారు. ఒక వేళ వారి అనుమానం నిజమైతే చైనా తన పరిధిని దాటి బ్రిటన్ రక్షణ సమాచారాన్ని తీసుకోవడం అతిక్రమణకు పాల్పడినట్లవుతుంది. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
MoD ఉద్యోగులు, సిబ్బంది పై ఇప్పటికే చైనా రెండుమూడు సార్లు హ్యాక్ కు ప్రయత్నించిందని బ్రిటన్ చెబుతోంది. ఉద్యోగుల పనిగంటలు, చెల్లింపులతో సహా ప్రస్తుతం రక్షణ శాఖ ప్రస్తుత సిబ్బంది, ఈనెల వారికి చెల్లించిన జీతభత్యాలు, మరి కొంతమంది సీనియర్ల బ్యాంకు లావాదేవీలను చైనా తస్కరించిందని ఆదేశం భావిస్తోంది. మాజీ సైనికుడు ప్రస్తుత కన్జర్వేటివ్ ఎంపీ టోబియాస్ ఎల్ వుడ్ మాట్లాడుతూ ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలను నగదు కోసం బలవంతం చేయవచ్చనే ధోరణిని చైనా ప్రదర్శిస్తుందన్నారు.
రక్షణ శాఖ సెక్రటరీ గ్రాంట్ షాప్ప్ మాట్లాడుతూ “multi-point plan” ను చైనా అమలు చేసి ఉండవచ్చని ఈ అంశం ఎంపీలకు తెలియచేయాల్సి ఉందన్నారు. బాధిత సైనికులు, మహిళలకు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రక్షణ వ్యూహం బలోపేతం చేసిన తర్వాత సైబర్ ఎటాక్ లు ఎక్కువయ్యే పరిస్థితులున్నాయని బ్రిటన్ రక్షణ వ్యవస్థ ఇటీవల హెచ్చరించింది. స్పైవేర్, రాన్సమ్ వేర్ వంటి పరికరాలతో డేటాను చోరీ చేసే అవకాశాలున్నాయని ముందే తెలిపింది.
Discussion about this post