శాటిలైట్ టీవీ లేని రోజుల్లో రామాయణం , మహాభారతం వంటి సీరియల్స్ దూరదర్శన్లో ప్రసారమై అందరి మన్నలు పొందాయి. రామాయణంలో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్ అందరిని ఆరోజుల్లో ఆకట్టుకున్నాడు.ఇపుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల్లో మీరట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది..
మీరట్ చారిత్రిక ప్రాధాన్యత ఉన్న నగరం. బీజేపీ కి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం 1996,1998,2009,2014,2019..సంవత్సరాలలో జరిగిన లోకసభ ఎన్నికల్లో బీజీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2009..నుంచి రాజేంద్ర అగర్వాల్ బీజేపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. అంతకుముందు 94..ఉపఎన్నికల్లో … తర్వాత జరిగిన 96.98..ఎన్నికల్లో అమర్ పాల్ సింగ్ బీజేపీ తరపున వరుస విజయాలు సాధించారు.99 ఎన్నికల్లో మటుకు కాంగ్రెస్ విజయం సాధించింది. 2004..లో బహుజన సమాజ్ పార్టీ గెలిచింది. 1996..కంటే ముందు జనతాదళ్ ,జనతా పార్టీలు ..సంయుక్త సోషలిస్ట్ పార్టీ గెలిచాయి. కాంగ్రెస్ 1952,1957,1962..ఎన్నికల్లో వరుస విజయాలు సాధించింది .
గత 25 ఏళ్ళ కాలంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు.. ఒక్కో ఎన్నిక కు ఆ పార్టీ బలం క్షీణిస్తూ వచ్చింది , 2014 లో ఇక్కడ నుంచి గ్లామర్ తార నగ్మా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆమెకు కేవలం 42,911 ఓట్లు వచ్చాయి. దారుణంగా ఓడిపోయారు .
మళ్ళీ ఆమె ఇక్కడ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన హరీంద్ర అగర్వాల్ కి 34,479 ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇక్కడ నుంచి సమాజ్ వాది పార్టీ పోటీచేస్తున్నది. బీఎస్పీ కూడా బరిలో ఉంది. బీజేపీ ఎలెక్షనీరింగ్ జాగ్రత్తగా చేసుకుంటే గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది. నగ్మా తర్వాత బరిలోకి దిగిన కళా రంగానికి చెందిన వ్యక్తి అరుణ్ గోవిల్ ఒక్కరే .
Discussion about this post