తెలంగాణలో మరో బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభలు నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నది. ఈసారి రెండంకెల స్థానాల్లో విజయం సాధించి అధికారపక్షానికి షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కరీంనగర్ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం తాడ్దాన్పల్లిలో16వ తేదీన జరగనున్నకేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలిని హరీష్ రావు, జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల శంఖారావంలో భాగంగా జహీరాబాద్, మెదక్ పార్లమెంట్లకు సంయుక్తంగా 16 తేదీ కేసీఆర్ జోగిపేట సమీపంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు
Discussion about this post