మహిళలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాలు దేశంలో చాలానే ఉన్నాయి …అయితే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఒక రాష్ట్రం నుంచి అయితే .. 72..ఏళ్లలో కేవలం ముగ్గురు మహిళలే లోకసభకు ఎన్నికయ్యారు. ఇంతకూ ఏ రాష్ట్రం అది ? అక్కడే మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ఎందుకు ఆసక్తి చూపడం లేదు ? ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశం రాష్ట్రం గురించి వినని వారు ఉండరు హిమాచల్ ప్రదేశ్ని యాపిల్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ యాపిల్స్ విరివిగా కాస్తాయి. హిమాచల్ పశ్చిమ హిమాలయాల నడిబొడ్డున ఉంది,దీన్ని ” దేవ్ భూమి “గా కూడా పిలుస్తారు. దేవతల నివాసంగా నమ్ముతారు.ఎత్తైన పర్వతాలు, మంచుతో నిండిన శిఖరాలు, శక్తివంతమైన నదులు, ఆకట్టుకునే ప్రవాహాలు, సుందరమైన జలపాతాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి .. ఉద్యానవనాలు, దట్టమైన అడవులు..పచ్చని వృక్షసంపదకు నిలయం హిమాచల్ ప్రదేశ్.ఇక్కడ ఓటర్లలో సుమారు 49 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ చట్ట సభల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. లోక్ సభకు ఎన్నికైన మహిళా ఎంపీలు గడచిన 72 ఏళ్లలో కేవలం ముగ్గురే.. గెలిచిన ఆ ముగ్గురిలో రాజకుమారి అమృత్ కౌర్, చంద్రేష్ కుమారి, ప్రతిభా సింగ్ ఉన్నారు.ఈ ముగ్గురు కూడా రాజ కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం.
కపుర్తలా రాజకుటుంబానికి చెందిన అమృత్ కౌర్… భారతదేశపు మొదటి ఆరోగ్య మంత్రి.. 1952లో మండి నియోజకవర్గం నుండి ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984 వరకు ఏ మహిళకు టిక్కెట్ లభించలేదు. 1984లో, హిమాచల్ ప్రదేశ్లోని జోధ్పూర్ రాజకుటుంబానికి చెందిన చంద్రేష్ కుమారి హిమాచల్ ప్రదేశ్ కి కోడలుగా వచ్చారు. కాంగ్రా నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు .. అప్పటి ప్రధాని ఇందిర హత్య దరిమిలా వచ్చిన సానుభూతి పవనాలతో ఆమె విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ 1998లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆమె భర్త ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో వీరభద్ర సింగ్ మండి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు,.. 2012లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిభా సింగ్ విజయం సాధించారు. ఆమె మళ్లీ 2014లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది,బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ చేతిలో ఓడిపోయింది. ఆయనే 2019 లో మరల గెలిచారు. మార్చి 2021లో రామ్ స్వరూప్ మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయింది నాటి ఉప ఎన్నికల్లో ప్రతిభా సింగ్ మూడోసారి గెలుపొందారు.
Discussion about this post