దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మరో మూడు దశలు మిగిలి ఉన్నాయి… ఆయా రాష్ట్రాల్లో ఆ ఎన్నికలు కూడా అన్ని సిద్ధం చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం మిషన్లను ఎలా భద్ర పరుస్తారు… భద్ర పరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు. రీ కౌంటింగ్కు పట్టుబడితే ఏం చేస్తారు… అనే వివరాలు మీ కోసం….
దేశంలో లోక్సభ ఎన్నికల హాడావి నడుస్తోంది… తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసినా… మరో మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో ఫలితాల కోసం ఉత్కంఠ నెలకొంది. ఇక ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఈవీఎంలను అధికారులు అతి జాగ్రత్తగా భద్ర పరుస్తారు. ఎలాంటి అవకతవకలు జరకుండా గట్టి బందోబస్తు మధ్య ఎన్నికల సామగ్రిని భద్రపరుస్తారు. పోలింగ్ పూర్తైన వెంటనే ఈవీఎం యంత్రాలను పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. ఈవీఎం గదులు ఉన్న పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
ఈవీఎం ఉన్న గదులదగ్గర ఎన్నికల అధికారులు మూడంచెల భద్రత ఉంటుంది. పోలింగ్లో ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లతో పాటు.. పలు విలువైన పత్రాలను ఐదేళ్ల వరకు భద్రంగా ఉంచుతారు… దానికి సంబంధించిన కట్టుదిట్టమైన చర్యలను అధికారులు తీసుకుంటారు. వాటిని సేఫ్గా ఉంచేందుకు ఎక్కడా వెనకాడరు.. ఎంత ఖర్చయినా సారి వాటిని భద్రపరుస్తారు. వీటన్నింటిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచి సీల్ చేస్తారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి నుంచి 45 రోజుల పాటు జిల్లా ఎన్నికల అధికారి అధ్వర్యంలో భద్రత కల్పిస్తారు.
పటిష్ట నిఘా మధ్య ఈవీఎలను స్ట్రాంగ్ రూంలోకు తరలిస్తారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో, కేంద్ర బలగాల గస్తీలో ఈవీఎంలను పెడతారు. ఇక గడువైపోయిన తర్వాత ఎన్నికల సంఘం వాళ్లు తీసుకెళ్లి గోదాముల్లో పెట్టెస్తారు… మళ్లీ వచ్చే ఎన్నికల వరకు…అంటే ఐదేళ్లు అత్యంత జాగ్రత్తగా ఉంచుతారు. ఐదేళ్లపాటు కాలపరిమితిముగిసిన తర్వాత మిషన్లలో ఉన్న డేటాను తీసేస్తారు..ఈసీ అధికారుల అవసరానికి అనుగుణంగా దేశంలో ఎక్కడైనా తిరిగి ఉపయోగించుకునేలా సెట్ చేసుకుంటారు అధికారులు.
ఆయా రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్థులపై ఓడిపోయిన వారు ఏవైనా ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తారని… ఒక వేళ ఆ డేటా ఏమైనా అవసరం అవుతుందనే అంచనాతో వాటిని జాగ్రత్త పరుస్తారు. కొందరు రీకౌంటింగ్ పటుబడుతుంటారు… దానిపై కోర్టులకు కూడా వెళ్తారు. న్యాయస్థానల తీర్పును అనుసరించి, ఆ నిబంధనల మేరకు రీ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. అందుకే ఐదేళ్ల పాటు ఈవీఎంలను భద్రపరుస్తారు.
Discussion about this post