ఒకప్పుడు ఎన్నికలనగానే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల హడావుడి ఉండేది. స్వస్తిక్ గుర్తుతో బ్యాలెట్ పేపర్పై తమ ఓటును వినియోగించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలుకుతూ దేశంలోని దాదాపు అన్ని ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతున్నారు. అసలు ఈవీఎంల చరిత్ర ఎంటి? దాని పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకుందాం? లెట్స్ వాచ్ దిస్ స్టోరి
ఓటరు నాడిని ఓడిసిపట్టే యంత్రమే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్. భారతదేశంలో ఈవీఎంలకు దశాబ్దాల చరిత్ర ఉంది. మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే.. తొలి రెండు లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులకు విడివిడిగా బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. అభ్యర్థుల పేర్లు వారి ఎన్నికల గుర్తులు ముద్రించిన పత్రాలను ఓటర్లకు ఇచ్చేవారు. ఇలా ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి.. వారికి కేటాయించిన బాక్సులో ఆ ఓట్లను వేసేవారు. అయితే.. ఈ పద్దతి ద్వారా ట్యాంపరింగ్, రిగ్గింగ్ పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి.
1960-1961 లో జరిగిన ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం 1999 లోక్సభ ఎన్నికల వరకు కొనసాగింది. అయితే.. ఈ విధానంలో ఓట్ల లెక్కింపుకు చాలా సమయం పట్టేది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి, నూతన సాంకేతికతను ఉపయోగించుకొని ఎన్నికలను మరింత నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించలనుకుంది అప్పటి ఎన్నికల సంఘం. ఈ క్రమంలో 1977లో అప్పటికి ఎలక్షన్ కమిషనర్ శబ్ధర్ ఎన్నికల నిర్వహణకు ఒక పరికరం తయారు చేయాలని ఈసీ నిర్ణయించింది. రెండేళ్ల తర్వాత అంటే 1979లో ఈసీఐఎల్లో ఒక ప్రోటేటర్ పీవీఎం తయారు చేసింది.
మైక్రో కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఈవీఎంని… బిఎల్ కంపెనీ తయారు చేసింది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఈవీఎంలను 1980లో ఎండి హనీఫా కనిపెట్టారు. ఈ ఈవీఎంలను తొలిసారి 1982 కేరళలోని నార్త్ పరావూరు ఉప ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగించారు. ఇదే సమయంలో మరో వాదన కూడా ఉంది. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలు వాడారు అని అంటారు. 1989లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డిజైన్ సెంటర్ ఫ్యాకల్టీ సభ్యులు సంయుక్తంగా ఈవీఎంలు డిజైన్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో వీటిని ఉపయోగించారు. ఆ తర్వత 1999 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో, 2003లోని అన్ని రాష్ట్రాల ఉపఎన్నికల్లో ఈవీఎంలు వాడారు. దీంతో ఆ తర్వాత దేశవ్యాప్తంగా 2004 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు వాడారు .
ఇదిలా ఉంటే.. పలు ఈ ఈవీఎంపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. ట్యాపరింగ్ జరుగుతుందని… ఒక వ్యక్తికి వేసిన ఓటు మరో వ్యక్తికి పడుతుందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే.. ఈవీఎంలను ఉపయోగించడానికి మన దేశంలో ఎలాంటి చట్టాలు లేవనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో 2013లో నాగాలాండ్ లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలకు ఔటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిటర్ను ఉపయోగించారు. అంటే ఆ మన ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ఈవీఎం పక్కన ఏర్పాటు చేసిన బ్యాక్స్ లో మనం ఎవరికి ఓటు వేశామనేది చూడవచ్చు. ఈవీఎం లో నమోదైనటువంటి ఓట్లు మధ్య ఏదైనా తేడా ఉందా అని పరిశీలించేందుకు దీంతో అవకాశం ఉంటుంది.
Discussion about this post