లోకసభ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఎరుపెక్కాయి.బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ 29 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించారు. వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో మరికొందరు తెలంగాణ వాసులు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత మూడున్నర నెలల్లో మహారాష్ట్ర-ఛత్తీ్సగఢ్, మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు చనిపోయారు.
పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో యన్ డి ఏ భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు...
Discussion about this post