అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని, జనంలో ఏమాత్రం సానుభూతి లేదంటూ రాజకీయ వర్గాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు లోక్సభ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే.. మరోవైపు, జనంలో మమేకమయ్యేవిధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించడంతోపాటు ప్రధానంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. బస్సు యాత్ర చేపట్టే విధంగా రూట్ మ్యాప్ను సిద్ధం చేయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post