అయోధ్య రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి వేడుకలు ఆలయంలో కనులపండువగా జరుగుతున్నాయి. శ్రీ రాముడి నుదిటిపై పడిన సూర్యుడి కిరణాలను తిలకించి భక్తులు పారవశ్యానికి లోనయ్యారు. శ్రీరామ నవమి సందర్భంగా రామ్లల్లా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తెల్లవారు జాము నుంచే రామభక్తులు సరయూలో స్నానాలు చేసి, ఆలయానికి తరలివస్తున్నారు. నవమి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శనాన్ని రద్దు చేశారు. ఏప్రిల్ 15 నుంచి 18 వరకు నవరాత్రుల నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శనం నిషేధించారు. రామ నవమి రోజున సాధారణ, ప్రత్యేక భక్తుల దర్శన ఏర్పాట్లు యధావిధిగా అమలు చేయనున్నారు. శ్రీరాముడు ఈ నాలుగు రోజులలో భక్తులందరికీ ఒకే విధమైన దర్శనం ఇస్తాడు. ఎవరికీ ప్రత్యేక పరిస్థితులు, వెసులుబాటు కల్పించేది ఉండదు.రాముడి దర్శనం కోసం గతంలో జారీ చేసిన పాస్లను రామమందిర్ ట్రస్ట్ రద్దు చేసింది.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post