ఎడారి దేశమైన దుబాయిలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి.దీంతో వరదలు పోటెత్తాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి.ఎప్పుడు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలుండే దుబాయి ఒక్కసారిగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయింది. ఇక్కడ ఏడాదిలో నమోదయ్యే వర్షపాతం .. 24గంటల్లోనే కురిసింది..గత 75ఏళ్లలో ఎన్నడూలేని విధంగా జడివాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.ఈ భారీ వర్షాలకు దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం లో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.. పలు విమానాలను రద్దు చేశారు. వర్షానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రన్వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విమానాశ్రయం పార్కింగ్ కూడా సగం నీట మునిగింది. ఎయిర్పోర్టుకు వెళ్లే రహదారుల్లో నీరు నిలిచిపోయింది. షాపింగ్ మాల్స్లో సైతం మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది వాతావరణ మార్పుల కారణంగా విమానాలన్నింటిని మళ్లించారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post