పురాతన సిరియాలో పాతిపెట్టబడిన ఒక పాత మట్టి పలక 3,200 ఏళ్ల క్రితం విషయాలు బట్టబయలు చేసింది. అదేమంటే సూర్యడు ఒకానొక రోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా చీకటిగా మారి అంతర్థానం అయ్యాడని తెలిపింది. దీనిని 1948 బయటికి తీశారు. KTU 1.78 పేరుతో ఉన్న ఈ మట్టిపలకపై చీకటి రోజు గురించి 1250 BCE, 1175 BCEలో రాశారని చరిత్రకారులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
ఉత్తర సిరియాలో ఉగారిట్ పురాతన ఓడరేవు నగరం. ఉత్తర మధ్యదరా సముద్రం కోస్తా తీరంలో ఇది ఉంటుంది. ఇక్కడ దొరికిన టాబ్లెట్ లో 3000 ఏళ్ల క్రిందట సూర్యుడు ఒకరోజు మధ్యాహ్న సడెన్ గా కనిపించలేదని అంతా చీకటిమయం అయిపోయిందని రాసి ఉంది. దాంతో ప్రజలంతా భయపడ్డారు. ఇది వినాశనానికి దారి తీస్తుందని, రాజ్యం ప్రమాదానికి లోనవుతుందని అందరూ భావించారు. వాస్తవానికి అది ఒక సంపూర్ణ సూర్య గ్రహణం. అప్పటి ప్రజలకు అది తెలియదు. ఇప్పుడు ఖగోళ శాస్త్రానికి సంబంధించి అన్ని విషయాలు తెలియడంతో ప్రజలు భయపడటం మానేశారు. voice:
ప్రతి 18 నెలలకు ఒకసారి ఇది సంభవిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 8న అమెరిక, కెనడా తదితర దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. 4 నిముషాల 28 సెకండ్ల ఆయా ప్రాంతాలన్నీ చీకటిగా మారాయి. 2031 వరకు ఏర్పడే సూర్యగ్రహణాలు భారత్ లో కనిపించబోవు.
Discussion about this post