కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలైన వేళంగి, పెద మల్లాపురంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపి అభ్యర్థి వరుపుల సుబ్బారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయనకు గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. 2004, 2014లో శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించారు. మరొకసారి అవకాశం కల్పిస్తే గిరిజన గ్రామాలకు రోడ్ల వసతి, త్రాగునిటీ వసతి కల్పిస్తానని చెప్పారు.
Discussion about this post