ప్రతీ ఏటా చైత్ర మాసంలో శుక్ల పక్షంలోని త్రయోదశి రోజున జైనులు మహావీర్ జయంతిని జరుపుకుంటారు. ఆరోజున కఠిన ఉపవాసంతోపాటు పూజలు నిర్వహిస్తారు. జైనమతానికి చెందిన 24వ తీర్థంకరుడైన మహావీర్ స్వామి పన్నెండేళ్లపాటు.. దట్టమైన అడవిలో కఠోర తప్పస్సు చేసి, ఆ తర్వాత నది ఒడ్డున సాల చెట్టు కింద జ్ఞానాన్ని పొంది మహావీరుడిగా మారారు. అహింస, ధర్మం గురించి మహావీరుడు ప్రచారం చేశారు. జైనులకు ఆరాధ్య దైవమయ్యాడు. మహావీరుడి వ్యక్తిగత జీవితం.. జైనుల జీవన విధానం, ఆహార నియమాలు.. భిన్నంగా ఉంటాయి. జనాభాపరంగా అల్పసంఖ్యాకులు.. వారి వాణిజ్య,వ్యాపారాల సామ్రాజ్యాల గురించి ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం..
మహావీరుడు సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేక బోధనలు చేశారు. అహింసను ప్రోత్సహించడం, సమస్త జీవులను గౌరవించడం జైనుల జీవన విధానం. మహావీరుని చిన్ననాటి పేరు వర్ధమాన్. 30 ఏళ్ల వయసులో రాజభోగ భాగ్యాలను త్యజించి, సత్యాన్వేషణలో అడవుల బాట పట్టాడు. మహావీర్ జయంతి రోజున జైన మతస్తులు ప్రభాత్ ఫేరీ, ఆచారాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. మహావీరుడు మానవులు మోక్షాన్ని పొందడానికి ఐదు నియమాలను ఏర్పాటు చేశాడు. దానినే పంచ సిద్ధాంతంగా పిలుస్తారు. అహింస… అంటే హింసకు తావులేకుండా, అస్తేయ అనగా దొంగిలించకూడదు. బ్రహ్మచర్య, సత్యంతోపాటు, అపరిగ్రహం అనగా.. ఇహలోకంలో ఎటువంటి వ్యామోహాలకు గురికాకుండా ఉండటాన్ని జైనం ప్రాధాన్యత ఇస్తుంది. వీటినే పంచ సిద్దాంతాలు అంటారు. మగధ రాజ్యాలతోపాటుగా తూర్పునకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. అప్పటికే 23 మంది తీర్థంకరులు ఉన్నా.. మహావీరుడు హయాంలో జైన మతానికి విశేష ప్రాధాన్యత సంతరించుకొని భారతదేశం నలువైపులా వ్యాపించింది.
క్రీస్తు పూర్వం 599 BC కాలంలో బీహార్లోని వైశాలికి సమీపంలోని కుండల గ్రామంలో మహావీర్ రాజు సిద్ధార్థ, రాణి త్రిసాల దంపతులకు మహావీర్ జన్మించాడు. 28 ఏళ్ల వయసులో ఆయన తండ్రి మరణించాడు. ఆ సమయంలో యశోధను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె పుట్టింది. రాజ కుటుంబంలో పుట్టిన తనకు విలాసాలు, సౌకర్యాలకు ఏ మాత్రం లోటు ఉండేది కాదు. అయినప్పటికీ వాటిని కోరుకోలేదు. సంపన్నమైనవి ఏవీ ఆయనను ఆకర్షించలేదు. అందుకే తన ఉనికి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. 30 ఏళ్ల వయసులో రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, ప్రాపంచిక విధులను వదిలేసి అంతర్గత శాంతి, ప్రశాంతత కోసం అడవికి వెళ్లాడు. 12 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసి, జ్ఞానోదయం పొందాడు. తర్వాత ఆయన మహావీరుడిగా మారాడు. అనంతరం మగధ రాజ్యాలతో పాటు తూర్పునకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు తదితర రాజులను కలుసుకున్నాడు.
ఆయన బోధనల్లో ముఖ్యమైనవి.. మిమ్మల్ని మీరు జయించండి. ఎందుకంటే కోటి మంది శత్రువులను జయించడం కంటే ఈ ఒక్కటి ఉత్తమం.
* ప్రతి వారికి ఆనందం అనేది మనలోనే ఉంటుంది. దాన్ని బయట వెతుక్కునేందుకు ప్రయత్నించొద్దు.
* దేవునికి ప్రత్యేక ఉనికి అంటూ ఏమీ లేదు. మనం సరైన ప్రయత్నాలు చేస్తే దైవత్వాన్ని పొందొచ్చు.
* అన్ని జీవులపై అహింసా వాదంతో ఉండాలి. మనసుతో, మాటతో, శరీరంతో ఎవరినీ హింసించకపోవడమే నిజమైన ఆత్మ నిగ్రహం.
* విజయం సాధిస్తే పొంగిపోవద్దు.. ఓటమి వల్ల కుంగిపోవద్దు.. భయాన్ని జయించిన వారు మాత్రమే ప్రశాంతంగా జీవించగలరని చాటారు.
సూక్షజీవులకు కూడా హానితలపెట్టకూడదని.. జైనులు సదా మాస్క్ ధరిస్తారు. వారి నియమాల్లో ప్రధానమైనది అహింస కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తీసుకోరు. ఉల్లి, వెల్లుల్లితోపాటు ఏ రకమైన దుంపలు తినరు. కారణం ఇవన్నీ వేర్ల రూపాంతరాలు కావడంతో వాటిని తీయాలంటే మొక్కలను చంపాల్సి వస్తుందని, అది జీవ హింస గనుక వాటిని ఆహారంగా వినియోగించరు. వివిధ రకాలైన పళ్లు, కూరలు, చిక్కుడు వంటి కాయగూరలు, గింజలు మాత్రమే తీసుకుంటారు. మితాహారం వారి నియమం. పాలు, పాల ఉత్పత్తులను తీసుకుంటారు. రాత్రి దీపపు వెలుగులకు క్రిమికీటకాలు ఆకర్షింపబడి చనిపోతాయి.. కాబట్టి వారు దీపాలు వెలిగించకముందే భోజనాన్ని తీసుకుంటారు.
భారతదేశంలో వారి జనాభా 0.41 శాతమే అంటే 5 కోట్ల, 14 లక్షల, 66 వేల 697 (ఆరువందల తొంభై ఏడు). భారత్ తర్వాత ఎక్కువగా వారి జనాభా ఉన్న దేశాలు అమెరిక, కెన్యా, ఇంగ్లాండు, కెనడాలు. జనభాపరంగా తక్కువే అయినప్పటికీ వర్తక వాణిజ్యాలలో వారిది పై చేయి. ప్రపంచంలో అతిపెద్ద జైన వ్యాపారవేత్తల్లో ఒకరు ఆదాని.. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం ఆయన భారతదేశంలోనే కాదు ఆసియాలోనే ఆయన అతిపెద్ద సంపన్నుడు. పోర్టు, విమానాశ్రయాలు నిర్వహణలో ఆయన పేరు గడించారు. ఫార్య్ఛూన్ వంటనూనెలు వారి సంస్థవే.
మన దేశంలో ఫార్మాకంపెనీలకు ఆధ్యుడు ..అతిపెద్ద ఫార్మాస్యుటికల్ కంపెనీ సన్ ఫార్మా దిలీప్ షాంఘ్వీ కి చెందింది. ఆయన కూడా జైనుడే .. రాన్ బాక్సీ కంపెనీని సన్ ఫార్మా టేక్ ఓవర్ చేసింది. . ఆసియన్ పెయింట్స్ చైర్మన్ అశ్విన్ సూర్యకాంత్ డాని కాగ, అభయ్ వకీల్ , మహేంద్ర చోక్సీ లు ఆసియన్ పెయింట్స్ కు పిల్లర్లు. వీరంతా జైనులే..భారతదేశంలో అతిపెద్ద న్యూస్ ప్రింట్ మీడియా గ్రూప్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవరిదో తెలుసా ? జైనుడైన దాల్మియాది.. దాని ప్రస్తుత అధినేత సాహుశాంతి ప్రసాద్. ఆమె దేశంలోనే ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ఆకాశ హర్య్మాలు నిర్మించిన రియల్ ఎస్టేట్ టైకూన్, మంగళ్ ప్రభాత్ లోధా, భారత్ లోనే అతి పెద్ద డైమండ్ కంపెనీ అధినేత రుస్సెల్ మెహత కూడా జైనులే. ఆయన కూతురు శ్లోకామెహతాను ఆసియా బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడిని పెళ్లి చేసుకుంది. భారత్ లోనే అతిపెద్ద మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుల సంస్థ జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ అధినేత భవర్ లాల్ జైన్ వీరంతా జైనులే..
టొరెంటో గ్రూపు అధినేతలైన సుధీర్ అండ్ సమీర్ మెహతా బ్రదర్స్ వ్యాపార సామ్రాజ్యంలోనే కాదు.. దానధర్మాల్లోనూ పేరుగాంచారు. ఫెవికో కింగ్ మధుకర్ ప్రకాష్, హిందూస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండీ అజిత్ గులాబ్ చంద్, బంద్రా వొర్లిలో సముద్రంపై అతి పెద్ద కట్టడం నిర్మించి ప్రశంసలు అందుకున్నారు. ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ హస్ ముఖ్ చుడ్గర్, రాజేశ్ ఎక్స్ పోర్ట్స్ రాజేశ్ మెహతా, ఐనాక్స్ గ్రూప్ దేవేంద్ర జైన్, ఎండ్యూరస్ టెక్నాలజీస్ అనురాగ్ జైన్, అరవింద్ మిల్స్ కస్తూర్ భాయ్ లాల్ భాయ్, HDFC దీపక్ పరేఖ్, ఇండిగో ఎయిర్ లైన్స్ కో ఫౌండర్ రాకేష్ గంగ్వాల్ వీరంతా జైనులే..
భారత సంతతిక చెందిన అజిత్ జైన్, అరుదైన వ్యాధుల్లో ఒకటైన కండరాల క్షీణత అంటే మస్కులర్ డిస్ట్రోఫీస్ బారిన పడిన వారికోసం సంపూర్ణ జీనోం సీక్వెన్సింగ్ అండ్ అనాలసిస్ సెంటర్ ను వాషింగ్టన్ లో నెలకొల్పిన బిలియనీర్ కాగ, కంక్రాఫ్ట్ కంపెనీల సీఈవో గా మను చందారియా ఉన్నారు. ఇన్ఫో- స్పేస్ ఫౌండర్ నవీన్ జైన్ అంతరిక్షం లోని రాళ్లను అంటే మెటియో రైటిస్ ను కలెక్షన్ చేసే అతి పెద్ద ప్రైవేట్ కంపెనీని అమెరికాలో కలిగి ఉన్నారు. మన హోం శాఖ మంత్రి అమిత్ షా, సైంటిస్టు విక్రం బాయ్ కూడా జైనులే..
బిలియన్స్ టు మంక్స్ అంటే వందల, వేల కోట్లు ఉన్నా సన్యాసం స్వీకరించేవారు కూడా జైనుల్లోనే అధికం. గుజరాత్కు చెందిన 24 ఏళ్ల మోక్షేశ్ షా కుటుంబం అల్యూమినియం వ్యాపారం చేస్తూ, మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నివాసం ఉంటోంది. వారి వార్షిక వ్యాపార టర్నోవర్ రూ.100 కోట్లు వరకు ఉంటుంది. ఆ కుటుంబం నుంచి సన్యాసి దీక్షను తీసుకుంటోన్న తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీలో ‘ప్లాస్టిక్ కింగ్’ గా పేరొందిన బిలియనీర్ భన్వర్ లాల్ రఘనాథ్ దోషి తన రూ. 600 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని త్యజించి సన్యాస దీక్షను స్వీకరించారు. సూరత్ డైమండ్ బిజినెస్ చేస్తున్న దేవాన్షి సంఘ్వీ పెద్ద కుమార్తె దీక్ష తీసుకుంది. మరో డైమండ్ బిజినెస్ చేస్తున్న దీపేశ్, పికాషాలు కూడా సన్యాసం స్వీకరించారు. రియాల్టీ వ్యాపారి భవేశ్ బండారి, ఆయన భార్య రూ. 200కోట్ల సంపదను కాదని దీక్ష చేపట్టారు. అంతకు ముందే వారి పిల్లలిద్దరూ దీక్ష తీసుకోవడంతో భవేశ్, ఆయన భార్య కూడా సన్యాసం స్వీకరించారు.
సన్యాసం స్వీకరించిన తర్వాత ప్రాపంచిక సుఖాలను వదులుకుని, పాదరక్షలు లేకుండా దేశాటనకు బయలుదేరుతారు. కేవలం రెండు జతల తెల్లటి దుస్తులు, భిక్ష కోసం ఒక పాత్ర, తెల్లటి చీపురు అంటే రజోహరన్ జైన సన్యాసులు కూర్చునే ముందు చుట్టూ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు… ఇది వారు అనుసరించే అహింస మార్గానికి చిహ్నం.. ఏది ఏమైనా డబ్బు సంపాదనలోనూ…దానిని త్యజించడంలోనూ జైనులది ప్రత్యేక శైలి.
Discussion about this post