విశాఖ గాజువాక ఎంఆర్వో కార్యాలయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18 న విశాఖలో విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ పత్రాలు రిటైనింగ్ అధికారికి అందించానన్నారు. నన్ను విశాఖ ప్రజలు ఆశీర్వదించి లోక్ సభకు పంపిస్తే ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాకుండా చూస్తామన్నారు. గంగవరం పోర్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కె ఏ పాల్ చెప్పారు.
Discussion about this post