మదురైలో కేంద్ర హోం మంత్రి అమిత్షా రోడ్షో ఆద్యంతం అట్టహాసంగా సాగింది.బీజేపీ అభ్యర్థి రామశ్రీనివాసన్కు మద్దతుగా ఈ రోడ్ షో నిర్వహించారు. రథం ఆకారంలో రూపొందించిన వ్యాన్ ఎక్కి అమిత్ రోడ్షోలో పాల్గొన్నారు. రోడ్షో ప్రారంభమైనప్పటి నుంచి కార్యకర్తలంతా ‘మోదీ మోదీ’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రహదారికి ఇరువైపులా చండీ మేళాలు, మంగళవాయిద్యాలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ ఈ రోడ్షో ప్రారంభమైంది. మదురై నేతాజీ రోడ్డు నుంచి ఝాన్సీరాణి పార్కు, నగల దుకాణం బజార్ మీదుగా విలక్కుతూన్ ప్రాంతం వరకు రోడ్షో కొనసాగింది. అంతకుముందు ఆయన పుదుకోట జిల్లా తిరుమయ్యమ్ కోట్టై భైరవర్ ఆలయాన్ని, సత్యవాగీశ్వరాలయాన్ని సందర్శించారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post