కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న బుట్టా రేణుక ఎల్ఐసీ హౌసింగ్ సంస్థ నుంచి దాదాపు రూ.360 కోట్ల రుణం తీసుకొని చెల్లించలేదు.దీంతో ఋణం కోసం బుట్టా రేణుక దంపతులు తనఖా పెట్టిన ఆస్తులను వచ్చేనెల 6న వేలం వేస్తామంటూ సంస్థ ప్రకటించింది. దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించనందునే ఆస్తులు వేలం వేస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. బుట్టా రేణుక కుటుంబ సభ్యులకు హైదరాబాద్లో ఉన్న ఆస్తులతో పోల్చితే ఈ అప్పు ఓ లెక్కలోకి కూడా రాదు. రెండుమూడు ఆస్తులు విక్రయించినా… మొత్తం అప్పు తీరిపోతుంది. కానీ బుట్టా దంపతులు దాదాపు రూ.360 కోట్లను రెండు రుణ ఖాతాల ద్వారా తీసుకున్నారు. ఈ రుణానికి 2019 నవంబరు 18న బుట్టా రేణుక, బీఎస్ నీలకంఠకు డిమాండ్ నోటీసు పంపింది. ఈ ఆస్తుల రిజర్వు ధరను రూ.360 కోట్లుగా ఎల్ఐసీ హౌసింగ్ చెబుతోంది.ఈ ఆస్తులన్నింటినీ ఏకమొత్తంలో ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.
పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో యన్ డి ఏ భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు...
Discussion about this post