తూర్పుగోదావరి జిల్లా కడియం పేరు చెప్పగానే గుర్తొచ్చేది అందమైన నర్సరీలు… పూల మొక్కలు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని అనేక మొక్కలు ఈ కడియం నర్సరీలో సందడి చేస్తుంటాయి. సృష్టికే ప్రతిసృష్టి చేస్తూ…వృక్షశాస్త్రంలో పీహెచ్డీ చెయ్యకపోయినా…నూతన వంగడాలను సృష్టించడంలో నిమగ్నమై, కొత్త రకాల మొక్కలను తయారు చేయడంలో రైతు కొప్పాల దుర్గారావు ఆరితేరారు…తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో సుమారు పదివేల ఎకరాల్లో పకృతిలో మరెక్కడా చూడని, కనిపించని మొక్కలను తమదైన శైలిలో రూపకల్పన చేస్తూ… ప్రపంచ దేశాల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. గత నాలుగేళ్ల క్రితం థాయిలాండ్ నుండి నేరేడు, మామిడి, జామ, సపోటా, నిమ్మ మొక్కలను దిగుమతి చేసుకొని వాటిపై ప్రయోగాలు చేస్తూ…కొత్త వంగడాలను సృష్టించారు. వీటితో నేరేడు, మామిడి, జామ, సపోటా, వాటర్ ఆపిల్ మొక్కల రూపకల్పనలో సక్సెస్ సాధించారు. ఈ అరుదైన నేరేడు మొక్కను సర్ అర్ధర్ కాటన్ జయంతి రోజున భారతదేశంలో మొదటి పంటగా పరిచయం చేశామని.. మామిడి మొక్కకు కాటన్ బ్యారేజ్ నిర్మాణంలో ఇంజనీరుగా విధులు నిర్వర్తించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుతో నామకరణం చేసామని తెలిపారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post