ఫ్యాక్టరీలను తెరిపించే సత్తా కాంగ్రెస్కు లేదని, బీజేపీయే తెరిపిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు ధర్నాను నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జిల్లాలకు సంబంధించిన నిజాం, సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీలని తెరిపించే సత్తా వారికి లేదని, తామే ఆ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని అరవింద్ అన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోను విడుదల చేసిందని, అందులో స్వామినాథం కమిటీ సిఫార్సుల మేరకు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని పొందుపరిచారని తెలిపారు. దేశంలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసిందని, ఇప్పటివరకు ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post