భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం దగ్గర పడుతుండటంతో భక్తులు తలంబ్రాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలు సమర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం ఆరు రాష్ట్రాలలోని మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో వడ్లను ఒలిచి కోటి తలంబ్రాలు తయారు చేసి భద్రాద్రి రామయ్యకు సమర్పిస్తున్నారు.
Discussion about this post