భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ ధ్వజాదివాసం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గరుడ ద్వజాదివాసం సందర్భంగా అర్చకులు ఉదయం భూతద్దంతో సూర్యభగవానుని ద్వారా అగ్ని సమీకరణ జరిగింది. యాగశాలలో మండల లేఖనము నిర్వహించి, సాయంత్రం స్థానిక జీయర్ మఠం వద్ద గరుడధ్వజ పటావిష్కరణ చేశారు. ధ్వజపటమును మంగళవాయిద్య, స్వస్తివాచనంలతో ఆలయానికి తీసుకొచ్చి, మూలవర్ల సన్నిధిలో స్వామివారికి చూపి, పటంలో ఏవైనా దోషములుంటే పరిహారము చేయాలని స్వామి వారిని వేడుకున్నారు. అనంతరం ఛాయాధివాసం, పంచశయాదివాసం, కుంభస్థాపన,తత్వన్యాస హెూమం నిర్వహించారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post