అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ కీలక ఒపీనియన్ పోల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఏడు రాష్ట్రాల్లో సర్వే చేయగా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్నకు ఆధిక్యం లభించనున్నట్లు తెలిసింది. బైడెన్ పనితీరుపై కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్లు ఓటర్లు తెలిపారు. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్నకు ఆరు నుంచి ఎనిమిది పర్సంటేజీ పాయింట్ల ఆధిక్యం లభించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒపీనియన్ పోల్ తెలిపింది.పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఒక్క విస్కాన్సిన్లో మాత్రమే ట్రంప్ కంటే బైడెన్ మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారు. మరోవైపు ప్రధాన పోల్స్ను పర్యవేక్షించే రియల్ క్లియర్ పాలిటిక్స్ బైడెన్ కంటే ట్రంప్ 0.8 పర్సంటేజీ పాయింట్లతో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post