దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉంది. ఈసారి సుమారు వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ కి జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న నిర్మల్, జగిత్యాల నుంచి సరకు భారీగా వచ్చింది. దాదాపు పసుపు పంట విక్రయాలు దగ్గరికి వచ్చాయి. గతంలో క్వింటాలుకు ఐదు ఆరు వేలకు పలికిన పసుపు ధర ఈసారి దాదాపుగా మూడింతలకు పెరిగింది.
Discussion about this post