మెక్సికోలోని చెటుమల్ తీరంలో ప్రపంచంలోనే లోతైన నీలం రంధ్రాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ‘తామ్ జా బ్లూ హోల్’ గా నామకరణం చేశారు. మొదట దీనిని లోతైన బ్లూ రంధ్రాల్లో రెండవదిగా అనుకున్నారు. కాని దీనిని కొలిస్తే సముద్ర మట్టానికి 420 మీటర్లు లోతు కలిగి మిగతా వాటన్నింటిని అధిగమించింది. మెరైన సైన్స్ లోని ప్రాంటియర్స్ జర్నల్ లో దీనిపై కథనం ప్రచురితం అయ్యాక దీన్ని గురించి ప్రపంచానికి తెలిసింది. సాధారణంగా 200 నుంచి 1,000 మీటర్ల మధ్య లోతులో మీసోపాలజిక్ జోన్ ఉంటుంది. ఈ జోన్ లో సూర్యుడి వెలుగు తగ్గుతుంది. ఈ చీకటి ప్రాంతంలోనే ఎక్కువ జల చరాలు జీవిస్తాయి. ఈ ప్రాంతంలో ఆహారం కొరత ఉన్నందున, చాలా మెసోపెలాజిక్ జీవులు రాత్రిపూట ఆహారం కోసం ఉపరితలంపైకి వస్తాయి. శాస్త్రవేత్తల ప్రకారం తామ్ జా బ్లూ హోల్ లో నీరు 420 MBSL గా ఉంది. ఎకో సౌండింగ్ ద్వారా దీని లోతును తెలుసుకుంటారు. కొన్ని రకాలైన చేపలు, రొయ్యలు, తాబేళ్లతోపాటు పగడపు దిబ్బలు కూడా బ్లూ హోల్స్ లో ఉంటాయి.
దిల్లీలో దోస్తి, పంజాబ్ లో కుస్తీ
దిల్లీ, హరియాణాల్లో చీపురుకు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే.....
Discussion about this post