ఆ లోక్సభ స్థానం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానం..ఆ సీటులో గెలిచిన వారిలో చాలా మంది కేంద్ర మంత్రులయ్యారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఓ విధంగా చెప్పాలంటే ఫైవ్స్టార్ రేటింగ్ ఉన్న నియోజికవర్గం అది. అందుకే అక్కడ పాగా వేయాలని ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ నియోజిక వర్గం ఏంటీ..! వాచ్ దిస్ స్టోరీ..
తెలంగాణలోని మహబూబ్ నగర్ లోకసభ స్థానానికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. ఇక్కడి నుంచి హేమ హెమీలు పోటీ చేసి గెలిచి.. రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పారు. రామేశ్వరరావు, మల్లికార్జున్, జైపాల్ రెడ్డి, కేసీఆర్ వంటి ఉద్దండులు ఇక్కడ నుండి పోటీ చేసి విజయం సాధించారు. కృష్ణా-తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న ఈ నేల పై ఇప్పుడు రాజకీయా రంజుగా సాగుతుంది. సిట్టింగు సీటును నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్, పోగొట్టుకున్న చోటే పరువు నిలబెట్టుకోవడం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అటు కింగ్ మేకర్ మేమే అంటూ బీజేపీ పావులు కదుపుతుంది. మహబూబ్నగర్ పార్లమెంటు సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. షాద్ నగర్, మక్తల్, కొడంగల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, జడ్చర్ల, దేవరకద్ర నియోజక వర్గాలు ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. మొత్తం 16 లక్షల 75 వేల ఓట్లు ఉన్నాయి. 1957 నుంచి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు విజయం సాధించింది. గత మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు.
Discussion about this post