జగన్ పై జరిగిన దాడి ఘటన ఐ ప్యాక్ టీమ్ డైరెక్షన్ లో జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఈసినిమాకు ప్రొడ్యూసర్ పొట్టి సారాయి రెడ్డి .. హీరో జగన్ అయితే భారతక్క హీరోయిన్ అన్నారు. జగన్ పై జరిగిన రాళ్ల దాడిని ప్రధాని మోడీ సైతం ఖండించగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘటనను డ్రామాగా అభివర్ణించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ..నదిలో కూరుకుపోయే వాడు ఏది దొరికితే దాన్ని ఆసరాగా అందుకుని బయట పడాలని అనుకుంటాడు. తాను ఓడిపోతాడని జగన్ కి తెలుసు .. `ఈ క్రమంలో ఏ జిమ్మిక్ చేసి అయినా ..ఏ మాయ చేసి అయినా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగమే ఈ రాయి దాడి అంటున్నారు తెలుగు దేశం నేత వర్ల రామయ్య.. ఇంకా ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లోనే విందాం.
ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. ఈ దాడి వ్యూహం ప్రకారమే జరిగిందని… జగన్, వెల్లంపల్లికి అయిన గాయంతోనే అది స్పష్టంగా అర్థవుతుందన్నారు… టీడీపీ నాయకులు వారి ప్రసంగాల్లో రెచ్చగొట్టే పదాలను మానుకుంటే బాగుటుందని అభిప్రాయపడ్డారు.
Discussion about this post