ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో అర్ధరాత్రి భారీ వర్షపాతం నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల రోజు నుంచి వాతావరణం చల్లబడగా.. ప్రతీ రోజూ ఏదో ఒకచోట వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కురవడంతో వాగుల ద్వారా నీరు.. ఇటీవల నిర్మించిన చిన్నోనిపల్లి రిజర్వాయర్కు చేరుకుంటోంది. పలుచోట్ల కల్లాల్లో ఉన్న ధాన్యం తడవడంతో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. మొన్నటివరకు 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు పడిపోయాయి. ఈదురు గాలులు, ఉరుములతో వాన పడింది. దాంతో రోడ్ల వెంట, కాలనీల్లో నీళ్లు పారాయి. ఖమ్మం మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసింది. మండుటెండలకు వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. మరో వైపు అన్నదాతలు చేతికి వచ్చిన పంట నష్టం వాటిల్లందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post