పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. మూడు వేల మంది పోలీసులతో జిల్లాలో భద్రత నిర్వహిస్తున్నామని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా డబ్బు, మద్యం, బంగారం, లాంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.
Discussion about this post