కూటమి అభ్యర్ధిగా కొత్తపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బండారుసత్యానందరావు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మహిళలు బండారుకు పూలవర్షాన్ని కురిపిస్తూ… మంగళ హారతులు పట్టారు. గత ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలోనూ, రాష్ట్రంలోనూ ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలు మాత్రమే ఆస్తులు కూడబెట్టుకుని అభివృద్ధి చెందారని చెప్పారు.
Discussion about this post