రాష్ట్ర రాజకీయాల్లో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు కీలక నేతలు ప్రయత్నించారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాన్ అన్న నాగబాబు పోటీ చెయ్యడానికి దాదాపుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. చివరికి ఆ స్థానం నుంచి ఎవరూ ఊహించని విధంగా సీఎం రమేష్ పోటీలోకి వచ్చారు. ఇక ఆయన ప్రత్యర్ధిగా వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడుని నిలబెట్టింది. ఆయన సీఎం రమేష్ కు సరైన ప్రత్యర్థేనా? కాదా? అన్న సంగతి పక్కన పెడితే వైసీపీ తన లెక్కలన్నీ పక్కన పెట్టేసిందని అర్థమవుతోంది. బీజేపీకి సహకరించేందుకే ఇలా చేసిందన్న ప్రచారం నియోజకవర్గంలో వినిపిస్తుంది.
అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పడగా… తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీనే ఐదుసార్లు గెలిచింది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో.. కాపు, గవర, కొప్పుల వెలమ సామాజికవర్గాల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఈ మూడు సామాజిక వర్గాలకు సంబందించిన ఓట్లే దాదాపు 70 శాతం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే అనకాపల్లిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఈ మూడు కులాల వారినే అభ్యర్థులుగా ఎంచుకుంటారు.
నాన్ లోకల్ అయినప్పటికీ సొంత సామాజికవర్గం అండ ఉంటుందన్న ఉద్దేశంతో వెలమ వర్గానికి చెందిన సీఎం రమేశ్ ఇక్కడి నుంచి పోటీకి రెడీ అయ్యారు. ఈ స్థానంలో వైసీపీ కాపు లేదా గవరకు అవకాశం ఇచ్చి ఉంటే ముందే అడ్వాంటేజ్ వచ్చి ఉండేదన్న అభిప్రాయం కూడా నియోజకవర్గంలో ఉంది. కానీ కొప్పుల వెలమ వర్గానికే చెందిన బూడి ముత్యాలనాయుడుకు టిక్కెట్ కేటాయించారు. ఇప్పుడు పొత్తు కారణంగా కాపు, గవరల ఓట్లు చీలిపోయే ఛాన్స్ కనిపించడం లేదు. వైసీపీ అభ్యర్థి కూడా ఈ వర్గాలకు చెందిన వ్యక్తి కాకపోవడంతో ఓట్లు సైతం చీలే ప్రసక్తిలేదు. నిజానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఈ సారి కూడా మాడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వైసీపీ మొదట నిర్ణయించింది. ఆర్థికంగా బలమైన నేత సీఎం రమేశ్ను ఢీకొట్టాలంటే సామాజిక కోణంతోపాటు స్థానిక నినాదం కూడా ఉపయోగపడుతుందని భావించిన వైసీపీ.. బూడి ముత్యాల నాయుడిని మొదటిసారిగా ఎంపీ బరిలోకి దింపింది. ఆయనకు ఇష్టం లేకపోయినా…ఆయన కుమార్తెకే మాడుగల టిక్కెట్ ఇచ్చి ఒప్పించింది.
గత ఐదేళ్లలో బూడి ముత్యాలనాయుడి పనితీరుపై వ్యతిరేకత, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో విభేదాలు, సొంత కుమారుడితోనూ వివాదం వంటివి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసాయి. మాడుగుల నియోజకవర్గానికి ప్రధాన రహదారి నిర్మించుకోలేకపోవడంపై జనాల్లో ఇప్పటికి అసంతృప్తి ఉందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. కూటమి తరఫున బీజేపీ నేత సీఎం రమేశ్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో ప్రముఖ నేతలంతా కూడా అనకాపల్లి ఫలితంపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర, జాతీయస్థాయిలో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేశ్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు. తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం నుంచి ప్రారంభించిన సీఎం రమేశ్.. గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరగా…ఇప్పుడు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. నాన్ లోకల్ పేరుతో ప్రచారం చేసేందుకు వైసీపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ… అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండడంతో…ఇది హైలెట్ కావడంలేదనే చర్చ నడుస్తోంది. రాజకీయం ఎలా చేయాలో తెలిసిన రాజకీయ నేత కావడం…వేధింపులకు అండగా ఉండడంతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిదిందని తెలుస్తోంది.
Discussion about this post